నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం
Published: Tuesday June 08, 2021
జన్నారం, జూన్ 7, ప్రజాపాలన ప్రతినిధి : రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయ అధికారిని సంగీత తెలిపారు. సోమవారం మండలంలోని కలమడుగు గ్రామంలో గల విత్తనాల దుకాణాన్ని ఎస్సై మధుసూదన్ రావు ఆర్ ఐ కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎఓ మాట్లాడుతూ రైతులు విత్తనాలు కొంటే వారికి తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని అలాగే అధిక ధరలకు విత్తనాల నమ్మితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు రసీదు చూపించి పంట వివరాలను నమోదు చేసుకోవాలన్నారు.
Share this on your social network: