నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం

Published: Tuesday June 08, 2021

జన్నారం, జూన్ 7, ప్రజాపాలన ప్రతినిధి : రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయ అధికారిని సంగీత తెలిపారు. సోమవారం మండలంలోని కలమడుగు గ్రామంలో గల విత్తనాల దుకాణాన్ని ఎస్సై మధుసూదన్ రావు ఆర్ ఐ కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎఓ మాట్లాడుతూ రైతులు విత్తనాలు కొంటే వారికి తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని అలాగే అధిక ధరలకు విత్తనాల నమ్మితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు రసీదు చూపించి పంట వివరాలను నమోదు చేసుకోవాలన్నారు.