రామచంద్రపురం గ్రామంలోఆసర పింఛన్ల పంపిణీ మధిర రూరల్

Published: Saturday September 03, 2022
సెప్టెంబర్ 2 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో శుక్రవారం నాడు రామచంద్రపురం గ్రామంలో ఆసరా పెన్షన్ లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథి జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల  కమల్ రాజు హాజరై
గ్రామంలో  స్థానిక మండల ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి ఆసరా పింఛన్లు పంపిణీ చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ రామచంద్రపురం గ్రామంలో నూతనంగా మంజూరైనటువంటి పెన్షన్లను జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు  శుక్రవారం నాడు గ్రామ పంచాయతీ కార్యాలయం లో పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు  కుటుంబం లోని పెద్దకొడుకుల 2016/-రూపాయలు అందిస్తున్నారని ఇప్పుడు కొత్త పెన్షన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది దీనివలన వృద్ధులు, వితంతువులు,వికలాంగులు ఆనందం తో ఉన్నారు కావున మనమందరం రాష్ట్ర ముఖ్యమంత్రికి అండగా ఉండాలని అన్నారు.
 ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వరావు ఆత్మ కమిటీ చైర్మన్ కోటేశ్వరరావు రైతు బంధు అధ్యక్షులు చావ వేణు భాస్కర్ రెడ్డి నరేందర్ రెడ్డి గ్రామ ప్రజలు వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరైనారు.