గాదె ప్రభాకర్ రెడ్డిని ఘనంగా సన్మానించిన ఐటీసీ పిఎస్పీడీ యూనిట్ భద్రాచలం పీఎం 5 టీం.....

Published: Monday January 02, 2023
బూర్గంపాడు (ప్రజా పాలన.)
ఈరోజు ఐ టి సి పి ఎస్ పి డి యూనిట్ భద్రాచలం నందు గత 40 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తూ ఈరోజు ఉద్యోగ విరమణ చేయుచున్న గాదె ప్రభాకర్ రెడ్డికి ఘనంగా వీడ్కోలు పలికిన పేపర్ మిషన్ 5 కార్మికులు. గాద ప్రభాకర్ రెడ్డి గత 40 సంవత్సరాలుగా వివిధ పేపర్ మిషన్లలో పనిచేసి ఈరోజు ఉద్యోగ విరమణ చేయుచున్న సందర్భంగా వారికి వివిధ సంఘాల నాయకులు మరియు కుటుంబ సభ్యులు ఘనంగా వీడ్కోలు పలకడం జరిగినది. వారి కుటుంబంలో వారికి ఇద్దరు ఆడపిల్లలు వారు ఇద్దరూ కూడా డాక్టర్లు కావడం గమనార్హం అంతే కాకుండా వారు ఇద్దరు అల్లుళ్ళు కూడా డాక్టర్లే కావడం గర్వించదగ్గ విషయం. గత 40 సంవత్సరాలుగా ఎంతో అంకితభావంగా ఐటిసిపిఎస్పిడి యూనిట్ భద్రాచలం నందు పనిచేసే ఈరోజు ఆయన ఉద్యోగ విరమణ చేయు ప్రతి ఒక్కరు కూడా నిబద్ధతతో కష్టపడి పనిచేసే అటు సమస్త కి ఇటు కుటుంబానికి ఎంతో మంచి పేరు తీసుకురావాలని పిల్లల్ని మంచి అభివృద్ధిలో పయనించేలా చదివించాలని వారు ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పేపర్ మిషన్ 5 కార్మికులు డిపార్ట్మెంట్ హెడ్ వివిధ  సంఘం నాయకులు పాల్గొన్నారు.