ఎన్ఎస్ఎస్ ఉత్తమ అధికారిగా గంగాపురం సరిత

Published: Wednesday December 08, 2021
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 7 ప్రజాపాలన ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వ యువజన, క్రీడల మంత్రిత్వ శాఖ ఆద్వర్యంలో జాతీయి సేవాసంస్థ (NSS) రాష్ట్ర స్థాయి ఉత్తమ ప్రోగ్రాం అధికారిగా గంగాపురం సరిత ఎంపికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర యువడవ క్రీడల కార్యదర్శి నవీన్ మిట్టల్ ప్రకటన విడుదల చేశారు. 2018 సంవత్సరంకు గాను ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల ఆద్యర్యంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలకు సరిత ప్రోగ్రాం ఆఫీసర్ గా విధులు నిర్వహించారు. 2017-18 సంవత్సరానికి గాను రాష్ట్ర స్థాయిలో ఆరుగురు అధికారులు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. జనవరిలో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ఈ అవార్డును సరిత అందుకొనున్నారు. తాను ఈ అవార్డుకు ఎంపిక కావడం ఆనందంగా ఉందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.