ఉస్మానియా తెలుగు రచయితల సంఘంలో" జిల్లా వాసికి స్థానం

Published: Wednesday August 24, 2022
కవి, రచయిత, చిలుకూరి రాధాకృష్ణ చారి" **
 
ఆసిఫాబాద్ జిల్లా ఆగస్టు23 (ప్రజాపాలన, ప్రతినిధి) :
 
ఉస్మానియా తెలుగు రచయితల సంఘం లో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన కవి, రచయిత, జర్నలిస్టు, చిలుకూరి రాధాకృష్ణ చారి ని శాశ్వత సభ్యునిగా నియమించినట్లు, ఉస్మానియా తెలుగు రచయితల సంఘం  జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు ఎల్కల ప్రశాంత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో ఉస్మానియా తెలుగు రచయితల సంఘం లో శాశ్వత సభ్యునిగా నియమించిన "జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు ఎల్కల ప్రశాంత్ కు" రాధాకృష్ణ చారి కృతజ్ఞతలు తెలిపారు.