ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
Published: Wednesday September 01, 2021
మేడిపల్లి, ఆగస్టు 31 (ప్రజాపాలన ప్రతినిధి) పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ సాయి ఐశ్వర్య కాలనీలో అమ్మ యోగ ఆశ్రమం సొసైటీ వారి ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ శారద ఈశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ ఉచిత వైద్య శిబిరంలో బీపీ, షుగర్ లతో పాటు ఇతర వ్యాధులను పరీక్షించి ఉచితంగా మందులను పంపిణీీీ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు వనంపల్లి గోపాల్ రెడ్డి, కాలనీ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: