స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన తహసీల్దార్, ఆర్ ఐ
Published: Monday November 29, 2021
బోనకల్, నవంబర్ 27 ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలో తాసిల్దార్ రాధిక, ఆర్ ఐ గుగులోత్ లక్ష్మణ్ చొప్పాకాట్లపాలెం, ముష్టికుంట్ల, చిరునోముల గ్రామాలలో ఓటర్ నమోదు ప్రక్రియ పై సర్వే నిర్వహించారు. కొత్త ఓటరు కొరకు ఎవరైతే దరఖాస్తు చేసారో వాళ్ళ ఇంటికి రెవిన్యూ అధికారులు వెళ్లి విచారణ చేసారు.గ్రామంలో బూత్ లెవెల్ కేంద్రాలకు వెళ్లి కొత్త ఓటర్ నమోదు, తొలగింపులు, సవరణలకు సంబందించిన ఫారాలని పరిశీలించి క్రింది స్థాయి అధికారులకు తగు సూచనలు చేసారు. ఈ కార్యక్రమంలో బూత్ లెవెల్ అధికారులు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Share this on your social network: