తల్లాడలో ముస్లీం సేవాసమితి ఏర్పాటు..

Published: Monday October 03, 2022
తల్లాడ, అక్టోబర్ 2 (ప్రజాపాలన న్యూస్):
తల్లాడలో ముస్లిం సేవ సమితిని ఆదివారం ఏర్పాటు చేశారు. స్థానిక మదీనా ఆటోమొబైల్ దుకాణం వద్ద ముస్లింసేవాసమితి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులుగా షేక్, కమల్, సెక్రెటరీగా షేక్ గాలిబ్, వీరితోపాటు కోశాధికారులుగా షేక్ మజార్, షేక్ సైదాలను నియమించారు. అదేవిధంగా సేవాసమితి గౌరవ అధ్యక్షులుగా షేక్ మస్తాన్ ను ఎన్నుకొన్నరు. తొలుత గాంధీజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి వారు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో  దస్తగిరి, జానీ, అన్వర్, మెహరాజ్, యాకూబ్, సలీం . నిజాం అక్మల్ భాష ఎండి పాషా హైమద్్త షేక్ జానీ. తదితరులు పాల్గొన్నారు.*