కంజర్ల కృష్ణమూర్తి చారిని సన్మానించిన క్రాంతి యూత్ అసోసియేషన్

Published: Thursday March 25, 2021

శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు కంజర్ల కృష్ణమూర్తి చారి విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం పటాన్చెరు నియోజకవర్గ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా రామచంద్రాపురం క్రాంతి యూత్ అసోసియేషన్ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కంజర్ల కృష్ణమూర్తి చారి మాట్లాడుతూ కమిటీ సభ్యులు ఇదే ఐకమత్యంతో ఉండాలని అన్నారు. ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కాలనీ అభివృద్ధికి తన పూర్తి సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. సన్మానించిన వారిలో జైపాల్, రవి, సిద్దన్న చారి, పండరి చారి, సంగమేశ్వర్ చారి, శ్రీనివాస్ చారి, రాజేందర్ చారి, శ్రీనివాస్ చారి, బ్రహ్మ చారి తదితరులు కంజర్ల కృష్ణమూర్తి చారి గారిని ఘనంగా సన్మానించారు.