గణేష్ ని దర్శించుకున్న యువజన పట్టణ అధ్యక్షుడు బింగి ప్రవీణ్*
Published: Wednesday September 07, 2022
మంచిర్యాల టౌన్, సెప్టెంబర్ 06, ప్రజాపాలన: మంచిర్యాల పట్టణంలోని స్థానిక హమాలివాడలోని శ్రీ శివ బాల యూత్ గణేష్ మండలి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి హాజరై, బాల గణేష్ ని దర్శించుకున్న టిఆర్ఎస్ పార్టీ మంచిర్యాల పట్టణ యువజన అధ్యక్షుడు బింగి ప్రవీణ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణేష్ నవరాత్రుల సందర్భంగా యువకులు, పట్టణ ప్రజలు, జాగ్రత్తగా జరుపుకోవాలని పట్టణ ప్రజలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గోల్ల శ్రీనివాస్, అనిల్ గౌడ్, ముద్దసాని గణేష్, చేరాల వంశీ, లక్ష్మి, శ్రీకాంత్, నగేష్, రాజేష్, రాము, సాయి, కిరణ్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: