గ్రామాల అభివృద్దే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం
Published: Saturday January 28, 2023
శంకరపట్నం జనవరి 27 ప్రజాపాలన రిపోర్టర్:
బెజ్జంకి మండలంలోని తిమ్మాయిపల్లి, బెజ్జంకి ఎక్స్ రోడ్ గ్రామాలలో నూతన గ్రామ పంచాయితీ భవన నిర్మాణాలకు శుక్రవారము రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ శాసనసభ్యుడు డా.రసమయి బాలకిషన్ భూమిపూజ చేశారు.
ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలను అభివృధ్ది చేసుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు సమన్వయంతో కలసి కట్టుగా ముందుకు సాగాలన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రతీ నెల నిధులు మంజూరు చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాలు అభివృద్ది చెందితేనే, దేశం అభివృద్ధి చెందుతుందనే సంకల్పంతో ప్రతీ గ్రామంలో పారిశుధ్య నిర్వహణ, ప్రతీ ఊరికి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్,పారిశుధ్య నిర్వహణ, హరిత హరం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే రసమయి వివరించారు.
Share this on your social network: