చైత్ర కుటుంబాన్ని పరామర్శించిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య

Published: Thursday September 16, 2021
హైదరాబాదు 15 సెప్టెంబర్ ప్రజాపాలన : హైదరాబాదులోని సింగరేణి కాలనీలో నర రూప రాక్షసుని చేతిలో బలైన  చిన్నారి చైత్ర కుటుంబాన్ని పరామర్శించిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి. చెన్నయ్య. ఈ మధ్య ఒక క్రూర మృగం చేతిలో చనిపోయిన గిరిజన కుటుంబానికి చెందిన కుమారి చైత్ర (సింగరేణి కాలనీ) కుటుంబాన్ని బుధవారం రోజు నాడు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ఆధ్వర్యంలో పరామర్శించడం జరిగింది. ఈ సందర్బంగా చెన్నయ్య  మాట్లాడుతూ పసి పిల్లలపై అఘాయిత్యాలు చేసే క్రూర మృగాలైన నర రూప రాక్షసులకు కఠినమైన శిక్షలు విధించాలన్నారు. ఈ క్రూర మృగం పై ఫోక్సో మరియు ఇతర చట్టాల ఆధారంగా వెంటనే శిక్షించాలన్నారు. ఈ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతే కాకుండా ఈ కాలనీలో ఉన్న యువతకు గుడుంబా మారక ద్రవ్యాలు, గంజాయి లాంటి మత్తు పదార్థాలు అలవాటు ఎక్కువగా ఉందన్నారు.ఇలాంటి మాదక ద్రవ్యాలు సరఫరా చేసే వారిని తక్షణమే గుర్తించి తగు  చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో ఇలాంటి ప్రాంతాలు అనేకం ఉన్నాయి అన్నారు. ఆయా ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు  పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని చెన్నయ్య పేర్కొన్నారు.