సర్కారీ కొలువు సాధించాలనే లక్ష్యంతో యువత ముందుకెళ్లాలి

Published: Wednesday March 30, 2022
మంత్రి చామకూర మల్లారెడ్డి
మేడిపల్లి, మార్చి29 (ప్రజాపాలన ప్రతినిధి) : యువత పగడ్బందీ ప్రణాళికతో కష్టపడి చదివితే సర్కారీ కొలువు సాధించవచ్చని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యలు చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు.పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని బుద్ధనగర్ సాయిబాబా కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసిన ఉచిత స్టడీ సర్కిల్ ను మంత్రి మల్లారెడ్డి సందర్శించారు. ఈ కార్యక్రమంలో మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు అమర్ సింగ్, మద్ది యుగంధర్ రెడ్డి, నవీన్ రెడ్డి, కౌడే పోచయ్య, హరీశంకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, నాయకులు పప్పుల అంజి రెడ్డి, కృష్ణ గౌడ్, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ రావు, డిఈ శ్రీనివాస్, ఏ ఈ వినీల్ తదితరులు పాల్గొన్నారు.