పల్లెల ప్రగతియే ప్రధాన లక్ష్యం

Published: Thursday November 10, 2022
 వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 9 నవంబర్ ప్రజా పాలన : పల్లెల ప్రగతియే ప్రధాన లక్ష్మణ్ వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మోమిన్ పెట్ మండల పరిధిలోని గుట్టమీది తండా, ఎల్లమ్మ గడ్డ తండా, రాళ్ల గుడుపల్లి గ్రామాలలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఉదయం ఏడు గంటల నుండి 12:30 గంటల వరకు మీతో నేను కార్యక్రమంలో భాగంగా గల్లీ గల్లీ తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గుట్టమీది తండా, ఎల్లమ్మ గడ్డ తండాలలో పాడబడ్డ ఇళ్ళు, పిచ్చి మొక్కలు తొలగించకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె ప్రగతిలో ఏం చేశారని పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని, గ్రామ పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలను ఎప్పటికప్పుడు శానిటేషన్ చేస్తూ పరిశుభ్రంగా ఉంచాలన్నారు. గ్రామంలో అవసరమైన చోట  రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి కృషి చేద్దామన్నారు. గ్రామాల్లో పంట పొలాల్లో వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేయాలని చెప్పారు. పాత విద్యుత్ స్థంబాలను తొలగించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా విద్యుత్ అధికారులు అందుబాటులో ఉంటూ విద్యుత్ సేవలు అందించాలన్నారు. మిషన్ భగీరథ మంచినీటి పైపు లైన్లు ఎక్కడ కూడా లీకేజీలు లేకుండా చూడాలన్నారు. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి, మిషన్ భగీరథ ట్యాంక్ లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని స్పష్టం చేశారు. ప్రజలకు పరిశుభ్రమైన మంచినీటిని అందించాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ మంచి నీటిని  ప్రజలందరూ త్రాగాలని అందుకు మిషన్ భగీరథ అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.