ప్రయాణికులకు అవగాహన కల్పించిన కళాబృందం*

Published: Monday September 12, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 11 ప్రజాపాలన ప్రతినిధి.

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 11 ప్రజాపాలన ప్రతినిధి.టి ఎస్ ఆర్ టి సి అభివృద్ధికి కొరకు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి మరియు విసి అండ్ ఎండి సజానార్ గార్ల ఆధ్వర్యంలో ఆర్టీసీ కళాబృందం రాష్ట్రంలో వివిధ డిపోల పరిధిలో వివిధ కళారూపాలలో కార్యక్రమాలు నిర్వహించుచున్నది. అందులో భాగంగా ఈరోజు ఇబ్రహీంపట్నం బస్టాండ్ మరియు అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో కళాకారులు ప్రయాణికుల కొరకు ఆర్టీసీ కల్పిస్తున్న సదుపాయాలు మరియు రాయితీల గురించి నాటక మరియు పాటల రూపంలో ప్రదర్శన ద్వారా పరిసర ప్రాంతాల ప్రజలకు వివరించారు. డిప్యూటీ ఆర్ ఎం (O) హయత్ నగర్ డివిజన్ శ్రీ కె కిరణ్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ కే రమేష్ , STI సౌజన్య మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.