సాదీ అరేబియాలో మురిమడుగు వాసి మృతి

Published: Monday April 04, 2022
జన్నారం రూరల్, ఏప్రిల్ 03, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మురిమడుగు గ్రామానికి చెందిన జాంబర్తి దుబ్బరాజం (41) అనే వ్యక్తి సౌదీ అరేబియాలో జిద్రా పట్టణంలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు, బ్రతుకు దెరువుకోసం మూడు సంవత్సరముల క్రితం సౌదీ అరేబియా వెళ్లిన దుబ్బరాజం మున్సిపల్ లో కార్మికుడిగా పనిచేస్తున్నాడని పనిలో ఉండగానే మున్సిపల్ వాహనం నుండి ప్రమాదవశాత్తు పడి మరణించినట్లు అక్కడి నుండి గల్ఫ్ వర్కర్స్ అవర్నేస్ సెంటర్ సభ్యులు తమకు సమాచారమించారని తెలిపారు. మృతులు దుబ్బరాజంకు భార్య మంజులతో పాటు ఇరువురు కుమాలున్నారు. దుబ్బరాజం మృతి దేహాన్ని స్వగ్రామానికి పంప్పేంచెందుకు అక్కడి ఎంబిసి ఆపీసర్లతో సంప్రదిస్తుమని జిడబ్య్లుఎసి సౌదీ శాఖ ముఖ్య సలహాదారు అబ్బుల్ రఫీక్ కు తెలిపారు.