ఏ బూసి యాదగిరి ఇకలేరు

Published: Friday May 21, 2021

బెల్లంపల్లి, మే 20, ప్రజాపాలన ప్రతినిధి : మాజీ నక్సలైట్ సామాజికవేత్త ఏబూషి పోషం పటేల్ ట్రస్ట్ చైర్మన్ ఏబూశి యాదగిరి అనారోగ్యంతో మృతి. బెల్లంపల్లి ముద్దు బిడ్డ సామాజికవేత్త ఎబూశి పోషం పటేల్ ట్రస్ట్ అధ్యక్షులు ఎబుసి యాదగిరి గురువారం ఉదయం మృతి చెందటం తీరనిలోటని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే అమ్రాజుల శ్రీదేవి అన్నారు. బెల్లంపల్లి పట్టణ అభివృద్ది కోసం అహర్నిశలు తపనపడే వ్యక్తి యాదగిరి  బెల్లంపల్లి ప్రజలు కోసం ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను నిర్వహించారని  ఎది ఏమైనా ఒక మానవత్వం కలిగిన మంచిమనిషిని కోల్పోవడం తీరని లోటని ఆమె  అన్నారు. వారి కుటుంబసభ్యులకు ఆమె ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు. యాదగిరి మృతదేహానికి బెల్లంపల్లి పాలిటెక్నిక్ ప్రక్కన గల స్మశాన వాటికలో గురువారం నాడు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ  వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఆయన అనుచరులు ఆవుల సాయిబాబా, బంక రమేష్, బడికెల రమేష్, టేకుల బస్తీ ప్రజలు, తదితరులు హాజరైనారు.