కరోనా సమయంలో ప్రజ్వల హాస్పిటల్ డాక్టర్ విక్టర్ ఇమాన్యుల్ అందించిన సేవలు అమోఘం

Published: Tuesday November 30, 2021
మేడిపల్లి, నవంబర్ 29 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు కరోనా సమయంలో ప్రజ్వల హాస్పిటల్ డాక్టర్  విక్టర్ ఇమాన్యుల్ అందించిన వైద్య సేవలు అమోఘమని కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పప్పుల అంజిరెడ్డి కొనియాడారు. కరోనా మొదటి, రెండవ వేవ్ సమయంలో డాక్టర్  విక్టర్ ఇమాన్యుల్ ప్రజలకు మెరుగైన సేవలు అందించినందుకు కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పప్పుల అంజిరెడ్డిలతో కలిసి పీర్జాదిగూడ శంకర్ నగర్ నివాసి సమిరెడ్డి మరియు కాలనీ వాసులు  కుతజ్ఞతగా ప్రజ్వల హాస్పిటల్ డాక్టర్ విక్టర్ ఇమాన్యుల్ కు పుష్ప గుచ్ఛం అందజేసి శాలువా తో ఘనంగా సన్మానించారు.