గ్రామాభివృద్ధికి ప్రజల సహకారం తప్పనిసరి : సర్పంచ్ రాజు నాయక్

Published: Wednesday June 23, 2021
పరిగి, 22 జూన్, ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని జి పి మైలారం గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్యం గురించి వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తల గురించి గ్రామ సభలో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి గ్రామ ప్రజల సహకారం తప్పనిసరిగా ఉండాలని సర్పంచ్ రాజు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజు నాయక్. కార్యదర్శి, అంజమ్మ వార్డ్ మెంబెర్స్. కోఆప్సన్ మెంబెర్స్ గ్రామ పెద్దలు సత్యనారాయణ, సురేందర్, నర్సిములు రమేష్. రత్నయ్య యాదయ్య పాల్గొన్నారు.