బీజేపీ ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు తాళ్లూరు సురేష్ ను పరామర్శించిన మండల బిజెపి నాయకులు అధైర్

Published: Saturday August 20, 2022
బోనకల్, ఆగస్టు 19 ప్రజా పాలన ప్రతినిధి: భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రముఖ నాయకులు ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లూరి సురేష్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.విషయాన్ని తెలుసుకున్న సహచర బిజెపి నాయకులు యువనేత బీపీ నాయక్, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి జంపాల రవి, యువ మోర్చా మండల అధ్యక్షులు కాలసాని పరుశురాం ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు మరీదు పరశురాముడు, ఇతర కార్యకర్తలు నాయకులు గురువారం నాడు సురేష్ స్వగృహానికి చేరుకొని పరామర్శించారు. సురేష్ పూర్తిగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యకరంగా మరల ప్రజా జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో సురేష్ కు ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికి మేమున్నాము అన్న భరోసాని సహచర నాయకులుగా అందజేశారు.