చేవెళ్ల ఎమ్మెల్యే శుభోదయ కార్యక్రమం చేవెళ్ల బ్యూరో : (ప్రజాపాలన)
Published: Tuesday November 08, 2022
తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లోని శుభోదయం కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే కాలే యాదయ్య శుభోదయం కార్యక్రమం లో భాగంగా సోమవారం షాబాద్ మండలం బోడంపహాడ్, అంతారం,గ్రామాలలో గడప గడపకు తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ప్రజలు చెబితే అప్పుడే సంబంధించిన అధికారులకు పిలిచి సమస్యలను తొందరగా పరిష్కరించాలని అధికారులకు తెలియజేసినారు.......
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...... తెలంగాణ రాష్ట్రం చేసిన ఎన్నో అభివృద్ధి పనుల గూర్చి ప్రతి ఇంటికి పథకాలు ప్రజలకు అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్న ఎమ్మెల్యే కు వివరించినారు. అప్పుడే అధికారులను పిలిచి సమస్య తెలుసుకొని సాల్వ్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం లో ఎంపీపీ,జెడ్పిటిసి,వివిధ శాఖల అధికారులు,షాబాద్ సిఐ,టిఆర్ఎస్ పార్టీ నాయకులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: