వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో 14న నిర్వహించే బంధు వాయిదా వేయడం జరిగింది

Published: Wednesday July 13, 2022

SFI ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి మద్దెల శ్రీకాంత్

 విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని   విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 14న నిర్వహించబోయే బందును 20 తారీకు వాయిదా వేసినట్టు ఎస్ఎఫ్ఐ ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి మద్దెల శ్రీకాంత్  తెలిపారు ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు స్కూల్ యూనిఫామ్ అలాగే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఎంఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ చేయాలని అనుకోవడం జరిగింది కానీ అకాల వర్షాల వల్ల ఆ బందును 14 తారీకు వాయిదా వేసి 20 తారీకు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ విద్యను కాపాడి పాఠశాలలో మౌలిక సదుపాయాలను మిగిలిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు