భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా మండల కార్యవర్గ సమావేశం

Published: Monday January 30, 2023
చేవెళ్ల : (ప్రజాపాలన):
 చేవెళ్ల మండల కేంద్రంలో ఆదివారం నాడు  భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా మండల అధ్యక్షులు *అర్రపల్లి అశోక్* ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం జరిగింది.
ముఖ్య అతిథులు  గా చేవెళ్ల  భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు *దేవర పాండురంగారెడ్డి,* బిజెపి మండల ప్రధాన కార్యదర్శి *అనంతరెడ్డి*
అనంతరం పాండురంగారెడ్డి.మాట్లాడుతూ :మాటలు కోటలు దాటుతున్నాయి కానీ అడుగులు గడప దాటట్లేదు అనే సామెత కెసీర్ పాలనకు సరిగ్గా సరిపోతుంది అని ఎద్దేవా చేశారు.రెండు సార్లు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఈ TRS పార్టీ దళితుల అభివృద్దే లక్ష్యమని మాయ మాటలతో పబ్బం గడుపు తున్నదన్నారు.TRS పార్టీ దేనికి భిన్నంగా పాలన కొనసాగిస్తున్నదన్నారు..
ఎనిమిదేళ్ల పాలనలో కనీసం 1000 మంది దళితులకు కూడా ఇండ్లు,భూమి ఇవ్వని ఈ TRS/BRS సిగ్గుతో తలదించుకోవలన్నారు.ఇకనైనా సోయికచ్చి ఇచ్చిన హామీని నిలబెట్టుకుని అర్హులైన దళితులందరికి ఇండ్లు,భూమి,దళితబందు తక్షణమే ఇవ్వాలని TRS ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు.
రాబోయే కాలం లో నీకు ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు.
అలాగే పార్టీ బలోపేతం కోసం ఏం చేయాలి ఏ విధంగా ముందుకు వెళ్లాలి అని వివరించారు..
ఈ కార్యక్రమానికి  చేవెళ్ల బీజేవైఎం టౌన్ అధ్యక్షులు బండారి శేఖర్ రెడ్డి. బిజెపి మండల ఉపాధ్యక్షులు 
వెంకట్ రెడ్డి. బీజేవైఎం జాయింట్ సెక్రెటరీ బాల్ రెడ్డి.దళిత మోర్చా మండల కమిటీ సభ్యులు పాలమాకుల రవీందర్.కుమార్.వెంకటేష్.సాయి.రమేష్.అనిల్.నవీన్.రామకృష్ణ.మల్లేష్.ప్రభాకర్. తదితరులు పాల్గొన్నారు.