ఎర్రుపాలెం మండలానికి 108 వాహనం కేటాయింపు
Published: Tuesday August 17, 2021
ఎర్రుపాలెం, ఆగస్టు 16, ప్రజాపాలన ప్రతినిధి : ఈ నెల 12న బనిగండ్లపాడు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ విపి గౌతమ్ కి చాలా వినతి పత్రాలు అందాయి. దీనిలో ముఖ్యంగా ఆరోగ్య కేంద్రానికి 108 ఎమర్జెన్సీ వాహనం చాలా అవసరమని నాయకులు అందరూ కలిసి వినతి పత్రాo ఇచ్చారు. అనంతరం వెంటనే మంజూరు చేయడం జరిగింది. అధికారికంగా కుయ్ కుయ్ వాహనం ఎర్రుపాలెం మండలంలో సేవలందించనుంది. ఈ కార్యక్రమాన్ని మండల ఎంపిపి దేవరకొండ శిరీష, జడ్పీటీసీ శీలం కవిత, మండల ఎంపిడిఓ అశోక్ కుమార్, మండల ఎంపిఓ శ్రీలక్ష్మి సర్పంచ్ జంగా పుల్లారెడ్డి, సొసైటీ చైర్మన్ శీలం అక్కిరెడ్డి, వైద్యాధికారి రాజు చేతుల మీదగా కుయ్ కుయ్ వాహనాన్ని ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ రాధాకృష్ణ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
Share this on your social network: