తాసిల్దార్ కు వినతిపత్రం

Published: Wednesday September 15, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినోత్సవంగా తెలంగాణ  ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తు మండల తహసీల్దార్ నాగ లక్ష్మీ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు దంతూరి సత్తయ్య, బంధారపు లింగస్వామి, కనతాల అశోక్ రెడ్డి, ఉప సర్పంచ్ మైసోళ్ల మత్యగిరి, మారోజు అనీల్ కుమార్, వెలిమినేటి వెంకటేష్, బచ్చు శ్రీనివాస్, బీజేవైఎం మండల అధ్యక్షులు రేగురి అమర్, పాక పుల్లయ్య, పద్మ రెడ్డి, తుమ్మల ఆనంద్, సందీప్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.