బీజేవైఎం మండల అధ్యక్షుడు గా కాలసాని నియామకం

Published: Friday September 24, 2021
బోనకల్: సెప్టెంబర్ 23, ప్రజాపాలన ప్రతినిధి : భారతీయ జనతాపార్టీ బోనకల్ మండల అధ్యక్షులు వీరపనేని అప్పారావు ఆధ్వర్యంలో బీజేవైఎం ఖమ్మం జిల్లా అధ్యక్షులు అనంత ఉపేందర్ గౌడ్ ఆదేశాలతో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కారంగుల మురళి కృష్ణ చేతుల మీదగా బీజేవైఎం బోనకల్ మండల అధ్యక్షులుగా ఆళ్ళపాడు గ్రామానికి చెందిన కాలసాని పరశురాముని నియమిస్తూ నియామక పత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలసాని పరుశురాం మాట్లాడుతూ నాకు ఈ పదవి రావడానికి కృషిచేసిన బిజెపి జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు అనంత్ ఉపేందర్ గౌడ్, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి జంపాల రవి, ఎన్ఆర్ఐ యువ నాయకులు బీపీ నాయక్, Sc మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు తాళ్లూరి సురేష్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుగ్లోత్ నాగేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శిలు గంగుల నాగయ్య, అల్లిక కాశయ్య కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా పట్ల నమ్మకం ఉంచి నాకు అప్పగించిన బాధ్యతల పట్ల పార్టీ అభివృద్ధి కొరకు పార్టీ బలోపేతమే ద్యేయంగా గెలుపే బాటగా నిరంతరం కృషి చేస్తానని తెలుపుకున్నారు.