బిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ వేడుకలు. మధిర డిసెంబర్ 9 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పర

Published: Saturday December 10, 2022
టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి టపాసులు కాల్చిన గులాబీ శ్రేణులు
జాతీయ పార్టీ ఆవిర్భావం, జెండా ఆవిష్కరణ తో ఆనందోత్సాహాలతో గులాబీ శ్రేణుల సంబరాలుటిఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రకటించిన భారత్ రాష్ట్ర సమితి  టిఆర్ఎస్ జాతీయ పార్టీ ను ఆమోదిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేయడం తో హైదరాబాద్ తెలంగాణ భవన్ నందు నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ ఎస్ జెండా ఆవిష్కరణ చేసిన సందర్భంగా జడ్పీ చైర్మన్, పార్టీ  నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు ఆదేశాల మేరకు మధిర పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద పార్టీ పట్టణ  మండల కమిటీల ఆధ్వర్యంలో ఘనంగా సంబురాలు నిర్వహించారు ముందుగా కేక్ కట్ చేసి టపాసులు కలుస్తూ నినాదాలు చేశారు టిఆర్ఎస్ పార్టీ బిిఆర్ఎస్ జాతీయ పార్టీగా ఆవిర్భావం తో పాటుగా జెండా ఆవిష్కరణ జరగడంతో ఆనందోత్సాహాలతో గులాబీ శ్రేణులు మధిర లో వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమంలో పార్టీ మండల  పట్టణ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, పల్లపోతు వెంకటేశ్వరరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు చిత్తారు నాగేశ్వరరావు, రంగిశెట్టి కోటేశ్వరరావు, మధిర సొసైటీ చైర్మన్ బిక్కి కృష్ణప్రసాద్, పట్టణ పార్టీ కార్యదర్శి అరిగే శ్రీనివాసరావు, TRS సోషల్ మీడియా మధిర నియోజకవర్గ ఇంచార్జ్ తాళ్లూరి హరీష్ బాబు, కౌన్సిలర్లు యన్నంశెట్టి అప్పారావు, మాధవి, నాయకులు మెండెం వెంకయ్య, బోయపాటి వెంకటేశ్వరరావు, మండల యూత్ అధ్యక్షుడు అబ్బూరి రామన్, ఆళ్ల నాగబాబు, జెవి రెడ్డి, అయిలూరి ఉమామహేశ్వరరెడ్డి, తొగురు ఓంకార్, గద్దల రాజా, గద్దల నాని, జిల్లేపల్లి బాబూరావు, కొంగర రవి, అబ్దుల్ కూరేశ్, పరిసా శ్రీనివాసరావు, బొగ్యం ఇందిరా, మాజీ జడ్పీటీసీ మూడ్ ప్రియాంక, ముద్దిసెట్టి మల్లీశ్వరి, కర్నాటి పద్మావతి, బుక్యా చంద్ర, సోషల్ మీడియా టీం హనుమంతరావు, కిట్టు, శ్రీను , రాంబాబు తదితరులు పాల్గొన్నారు.