ప్రతి నెల మొదటి తేదిన వేతనాలు చెల్లించాలని

Published: Friday September 17, 2021
బోనకల్, సెప్టెంబర్ 16, ప్రజాపాలన ప్రతినిధి : ప్రతి నెల మొదటి తేదిన వేతనాలు చెల్లించాలని కోరుతూ టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం నాడు మధిర ఎస్ టి ఓ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శిఆర్ లక్ష్మణ్ రావు మాట్లాడుతూ ప్రతి నెల మొదటి తేదిన వేతనాలు చెల్లించాలని సప్లీమెంటరీ బిల్లుల మంజూరులో జాప్యాన్ని నివారించాలని పెండింగ్ లో ఉన్న అన్ని బిల్లులను వెంటనే మంజూరు చేయాలనిరాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఎస్ టి ఓ అశోక్ రెడ్డికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో బోనకల్ మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు రామకృష్ణ, మధిర మండల అధ్యక్షులు ఆర్ వినోద్ రావు, ప్రధాన కార్యదర్శి ఎస్ కే వలీ, ఎర్రుపాలెం మండల ప్రధాన కార్యదర్శి అనుమోలు కోటేశ్వరరావు, ఎర్రుపాలెం మండల అధ్యక్షులు బి.నాగరాజు, ఫణీంద్ర కుమారి, ఎం సైదారావు ఎస్ రామకృష్ణ, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.