తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం మండలాధ్యక్షుడు నియామకం.
Published: Wednesday December 28, 2022
శంకరపట్నం డిసెంబర్ 27 ప్రజాపాలన రిపోర్టర్:
శంకరపట్నం మండల కరీం పేట గ్రామానికి చెందిన మెరుగు శ్రీనివాస్ తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం శంకరపట్నం మండల శాఖ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు సముద్రాల అజయ్ తెలిపారు. అంబేద్కర్ సంఘంలో శ్రీనివాస్ చురుకైన పాత్ర వహిస్తూ ముందుకు సాగుతున్నందుగాను పూర్తిస్థాయి అధ్యక్షునిగా శ్రీనివాసుని నియమించినట్లు ఆయన తెలిపారు.
Share this on your social network: