కొడంగల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి విచ్చేసిన రాష్ట్ర మంత

Published: Friday June 17, 2022
కొడంగల్ ప్రతినిధి జూన్ 16:మంత్రి హరీష్ రావు గారు కొడంగల్ నియోజకవర్గం లోని పలు మండలాలలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. కొడంగల్ పట్టణంలో డిగ్రీ కళాశాల మరియు నూతన మున్సిపల్ ఆఫీసు శంకుస్థాపన, కూరగాయల మార్కెట్ యార్డ్, కొత్తగా నిర్మించినటువంటి 50 పడకల ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ప్రారంభించడం జరిగింది. అనంతరం భారీ బహిరంగ సభ లో పాల్గొని స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధినే ధ్యేయంగా దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతున్నాడని సంతోషం వ్యక్తపరిచారు.
ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు గారికి నరేందరన్న యువసేన కొడంగల్ అధ్యక్షుడు  ఏం.వెంకటేశం నాగలిని బహుకరించారు. యువసేన సభ్యులు, డి ప్రవీణ్, ఏం రాజు, బి రజినీకాంత్, యన్ కృష్ణ,ఎం శ్రీనివాస్, హకీం,టీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.