టిఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జన్మదిన వేడుకలు

Published: Tuesday April 20, 2021
మధిర, ఏప్రిల్ 19, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధి స్థానిక టిఆర్ఎస్ కార్యాలయంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జన్మదిన వేడుకలను టిఆర్ఎస్ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇటువంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని అని కొనియాడారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి జిల్లాకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని ఈ సందర్భంగా తెలిపారు. ఖమ్మంలో బస్టాండు నిర్మాణానికి కనిరంతర కృషి చేసిన ఘనత కూడా పువ్వాడ అజయ్ కుమార్ తగ్గుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మొండెం లలిత, మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తరు నాగేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రావూరి శ్రీనివాస రావు, కనుమూరి వెంకటేశ్వరరావు, టిఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు బొగ్యం ఇందిర, ఐలూరు ఉమా మహేశ్వర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు కొట్టారు రాఘవరావు, కౌన్సిలర్ ఎం యన్నంసెట్టి అప్పారావు, ఎస్సీ.డీ కాదర్, ముత్తవరపు ప్యారి, గుగులోతు కృష్ణ, ఆవుల రామకృష్ణ, ములకలపల్లి వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.