రాజీవ్ స్వగృహ ప్లాట్లు గృహాలు ఈ వేలం

Published: Tuesday February 08, 2022
జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 07 ఫిబ్రవరి ప్రజాపాలన : రాజీవ్ స్వగృహ అధీనంలోని ప్లాట్లు, గృహలను ఓపెన్ e - వేలం ద్వారా అమ్మకాలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ నిఖిల సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా తాండూర్ మండలంలోని కొకట్ గ్రామంలో సర్వే నం.52లో గల ప్లాట్లు, గృహలను పారదర్శకంగా, న్యాయపరమైన పద్దతిలో e-వేలం ద్వారా ప్రభుత్వం నిర్ణయించే తేదీలలో అమ్మడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం త్వరలో తెలిజేయడం జరుగుతుందని కలెక్టర్ ప్రకటనలో తెలియజేసినారు.