మీర్ పేట్ లో రక్తదానం శిబిరం

Published: Thursday February 18, 2021
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; తెలంగాణ ఉద్యమ రథసారథి అయినటువంటి మన రాష్ట్ర సీఎం చంద్రశేఖర రావు గారి జన్మదిన ఉత్సాహాలలో పురస్కరించుకొని  టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో మీర్ పేట్ కార్పొరేషన్ క్రాస్ రోడ్ వద్ద  నిర్వహించిన గవర్నమెంట్ రక్తదానం శిబిరాన్ని డాక్టర్ జయలక్ష్మి సమక్షంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..... మహేశ్వరం నియోజకవర్గంలో కాంపిటీషన్ ఎగ్జామ్ లో పాల్గొంటున్న విద్యార్థులకు అందరికీ ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి త్వరలో సోషల్ మీడియా ద్వారా వివరిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా నాటిన మొక్కలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి వాటిని పెంచాలని చెప్పారు. కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ.... ఈ కార్పొరేషన్ లో ఉన్న కార్పొరేటర్లు ఒకే తాటిపై కలిసికట్టుగా ఉంటూ సీఎం జన్మదిన ఉత్సాహాన్ని పురస్కరించుకొని దాదాపు 50 మంది వరకు రక్తదానం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్ పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి, కార్పొరేషన్ దుర్గ దీప్ లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, టిఆర్ఎస్ అధ్యక్షులు సిద్దాల లావణ్య బీరప్ప, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కామేశ్వర్ రెడ్డి, ఫ్లో ర్ లీడర్ భూపాల్ రెడ్డి, కార్పొరేషన్ అధికారులు, కార్పొరేషన్ కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, టిఆర్ఎస్ నాయకులు, మహిళా మణులు, అభిమానులు కార్యకర్తలు యువకులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.