పేదవారి జీవితాల్లో వెలుగులు నింపడమే సీఎం కేసీఆర్ ముఖ్య లక్షణం జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ ర

Published: Tuesday March 07, 2023
మధిర మార్చి 6 ప్రజాపాలన ప్రతినిధి:తెలంగాణ కంటి వెలుగు తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా రాష్ట్రంలోని సంపూర్ణ అందత్వ నిర్మూలన లో భాగంగా మండల పరిధిలోని నిదానపురం గ్రామపంచాయతీ నందు ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ప్రారంభించారు. ఈ అవకాశాన్ని గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి, ఎంపీపీ మెండం లతా వెంకయ్య సర్పంచి భాధాకృష్ణారెడ్డి, సెక్రెటరీ హరి,dr వెంకటేష్, టిఆర్ఎస్ నాయకులు కరి వేద వెంకటేశ్వరరావు, కరివేద సుధాకర్ రావు, ఏఎంసి మాజీ చైర్మన్ చితారు నాగేశ్వరరావు, రావూరి శ్రీనివాసరావు, ఎంపీటీసీ మరియమ్మ , మెడికల్ ఆఫీసర్ శ్రీకాంత్, ఆప్తో మెటీస్టర్ పులిపాటి వినయ్, ఆరోగ్య సిబ్బంది, ఆశాలు, నాయకులు పాల్గొన్నారు.