గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన వైద్యులు డాక్టర్ గండ్ర కేశవ అన్వేష్
Published: Saturday August 06, 2022
కోరుట్ల, ఆగస్టు 05 (ప్రజాపాలన ప్రతినిధి):
రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా కోరుట్ల పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ గండ్ర కేశవ అన్వేష్ జన్మదిన సందర్భంగా ప్రకాశం రోడ్డులో గల హనుమాన్ దేవాయలం ఆవరణలో మొక్కలు నాటారు. ఇంతటి మహోత్తర కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎం.పి సంతోష్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు క్యాతం సృజన్, చిత్తారి ఆనంద్, బొలిశెట్టి రంజిత, సాయి చందు నేత,
తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: