ట్రస్మా ఆధ్వర్యంలో నస్పూర్ మండల పాఠశాలల ఆటల పోటీలు ప్రారంభం

Published: Wednesday December 21, 2022
మంచిర్యాల టౌన్, డిసెంబర్ 20, ప్రజాపాలన: ట్రస్మా ఆధ్వర్యంలో మంగళవారం రోజున  నస్పూర్ లోని మార్టిన్స్ గ్రామర్ హై స్కూల్ లో   ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ఆటల పోటీల ప్రారంభించారు.   ఈ సందర్భంగా ట్రస్మా జిల్లా అధ్యక్షుడు రాపోలు విష్ణువర్ధన్ రావు పాల్గొని మాట్లాడుతూ ట్రస్మా ప్రతీ సంవత్సరం విద్యార్థులలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని  గుర్తించి వారిని రాష్ట్ర స్థాయికి, జాతీయ స్థాయికి ఎదిగేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.ఈ ఆటల పోటీలలో బాలుర, బాలికల విభాగంలో  500 మంది విద్యార్థులు పాల్గొన్నారని ఈ మండల  సెలక్షన్స్ లో ఎంపికైన విద్యార్థులకు రెండు రోజులు శిక్షణ తరగతులు నిర్వహించి త్వరలో జరిగే ట్రస్మా జిల్లాస్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ లో గెలుపొందే విధంగా వారికి శిక్షణ ఇస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో  ట్రస్మా మండల అధ్యక్షురాలు సభిహా సుల్తానా, ప్రధాన కార్యదర్శి పి.తిరుపతి రెడ్డి, జిల్లా స్పోర్ట్స్ సెక్రెటరీ పెంచాల శ్రీధర్,  ట్రస్మా సభ్యులు అప్పని తిరుపతి, ఫాదర్ జస్టిన్, వసీం   మండలంలోని వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.