జనసేన పార్టీ ఆధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణీ

Published: Friday June 17, 2022
బోనకల్, జూన్ 16 ప్రజా పాలన ప్రతినిది: అందరికీ విద్య అందరి బాధ్యత అనే నినాదంతో రాకేష్ సహకారంతో మధిర నియోజకవర్గం నాయకుల తాళ్లూరి డేవిడ్ మండల నాయకులు ఆధ్వర్యంలో బోనకల్ మండలంలో వివిధ గ్రామాల్లో నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా
రాకేష్ మాట్లాడుతూ పేదరికంతో చదువుకి ఇబ్బంది పడే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మా యొక్క సహకారం జనసేన పార్టీ సహకారాలు ఎప్పటికీ అందిస్తూనే ఉంటామని, ముందు ముందు విడతలవారీగా మండలం లో గల వివిధ పాఠశాలల్లో లో నోట్ బుక్స్ ,బ్యాక్ ఫుట్ వేర్ ,టాలెంట్ టెస్టులు, స్కాలర్షిప్లు ప్రతిభగల విద్యార్థులకు నగదు ప్రోత్సాహంగా రూపంలో అందిస్తామని అన్నారు. అదేవిధంగా తరగతి గదిలో ఉన్న విద్యార్థుల్లో దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చదువుకోలేక ఉన్న విద్యార్థులకు సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్ వింగ్ నాయకులు వేముల వినయ్ కుమార్ ,సోషల్ మీడియా నాయకులు భరత్ సాకేత్, మండల నాయకులు అశోక్ ,రమణ , అద్దంకి సంతోష్ సాయి, ఎస్ కె బాజీ బాబా, అర్వపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు.