రెండో విడత గొర్రెల పంపిణీ పథకం పై అవగాహన

Published: Thursday April 13, 2023

 

 జన్నారం, ఏప్రిల్ 12, ప్రజాపాలన: మండలంలోని లింగయ్యపల్లే గ్రామ పంచాయితీలో రెండవ విడుత గొర్రెల పంపిణీలో బాగంగా యాదవులకు, మండల వైద్యాధికారి శ్రీకాంత్ అవగాహన నిర్వహించారు. బుధవారం మండల కేంద్రంలోని లింగయ్య పల్లె గ్రామంలో యాదవులకు రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలోని రెండో విడత గొర్రెలు పంపీనీలో అవసరమైన డాక్యుమెంట్స్, అప్లోడింగ్, డీడీ లు కట్టి  ఆ పత్రాలను వారి దగ్గర ఉంచుకోవాలన్నారు. యాదవుల సొసైటీ  కార్యక్రమాలు వాటి ఉపయోగాల గురించి గుర్తు చేశారు. ప్రస్తుతం ఎండాకాలం లో పశువుల, గొర్రెల కాపారులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి సిబ్బంది, యాదవులు, గొర్రెల కాపరులు, తదితరులు పాల్గొన్నారు. జన్నారం, ఏప్రిల్ 12, ప్రజాపాలన: మండలంలోని లింగయ్యపల్లే గ్రామ పంచాయితీలో రెండవ విడుత గొర్రెల పంపిణీలో బాగంగా యాదవులకు, మండల వైద్యాధికారి శ్రీకాంత్ అవగాహన నిర్వహించారు. బుధవారం మండల కేంద్రంలోని లింగయ్య పల్లె గ్రామంలో యాదవులకు రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలోని రెండో విడత గొర్రెలు పంపీనీలో అవసరమైన డాక్యుమెంట్స్, అప్లోడింగ్, డీడీ లు కట్టి  ఆ పత్రాలను వారి దగ్గర ఉంచుకోవాలన్నారు. యాదవుల సొసైటీ  కార్యక్రమాలు వాటి ఉపయోగాల గురించి గుర్తు చేశారు. ప్రస్తుతం ఎండాకాలం లో పశువుల, గొర్రెల కాపారులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి సిబ్బంది, యాదవులు, గొర్రెల కాపరులు, తదితరులు పాల్గొన్నారు.