వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సొసైటీ చైర్మన్ నాగూర్ మనోహర్..

Published: Thursday October 29, 2020

కొల్చారం అక్టోబర్28 (ప్రజాపాలన): మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.  ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సొసైటీ చైర్మన్ నాగూర్ మనోహర్ మాట్లాడుతూ రైతులు ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులను నమ్మి నష్టపోకూడదనే  ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు వరి కొనుగోలు కేంద్రాన్ని గ్రామంలో ప్రారంభించామని చెప్పారు. మరియు ఏ గ్రేడ్ వరి ధాన్యానికి 1888 రూపాయలుగా బి గ్రేడ్ వరి ధాన్యానికి 1868 గా ప్రభుత్వం ధరలు నిర్ణయించడం జరిగిందని చెప్పారు. ఈ యొక్క కార్యక్రమంలో జడ్పిటిసి మేఘమాల సంతోష్, ఎంపీటీసీ పల్వంచ అరుణ కృష్ణ గౌడ్, తెరాస మండల మాజీ అధ్యక్షుడు దేవన్నగారిశేఖర్, సీఈఓ క్రిష్ణ, కారోబార్ ప్రభాకర్, చౌరిగారి చిన్న రాములు, పెగుడు ఎల్లయ్య,  పల్వంచ దుర్గ గౌడ్, చౌరిగారి సాయి, బిట్ల నర్సింలు, హమాలీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.