అండర్ డ్రైనేజీ పనులను ప్రారంభించిన మేయర్ బుచ్చిరెడ్డి

Published: Thursday April 21, 2022
మేడిపల్లి, ఏప్రిల్ 20 (ప్రజాపాలన ప్రతినిధి) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్ టెలిఫోన్ కాలనిలో స్థానిక కార్పొరేటర్ కొత్త దుర్గమ్మతో కలిసి మేయర్ సామల బుచ్చిరెడ్డి రూ 15 లక్షలతో అండర్ డ్రైనేజీ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.