బాధిత కుటుంబానికి 5 వేల ఆర్థిక సహాయం....

Published: Monday January 10, 2022

బీరుపూర్, జనవరి 09 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల్ తుంగూర్ గ్రామానికి చెందిన కీ.శే ఆడేపు చిన్న గంగన్న కుటుంబాన్ని బీర్పూర్ మండల బీజేపీ ఇంచార్జ్ మదన్మోహన్ గల్ఫ్ బాధిత కుటుంబాన్ని ఆదివారం రోజున పరామర్శించారు. దుబాయిలో నవంబర్ 29న హార్ట్ ఎటాక్ తో చనిపోయిన గల్ఫ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి బీజేపీ పార్టీ తరపున అన్ని విధాలుగా అదుకుంటామని భవిష్యత్ లో చిన్న కూతురు పై చదువులకు ఆర్థికంగా అండగా ఉంటామని తెలిపారు. అనంతరం 5 వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో బీర్పూర్ మండల బిజెపి అధ్యక్షుడు ఎనగందుల చంద్రశేఖర్ మండల ప్రధాన కార్యదర్శి ఆడేపు రమేష్ దూట నరేందర్ కంది రమేష్ చిర్నేని భాస్కర్ ఉయ్యాల స్వామి ఆడేపు వెంకటేష్ ఆడెపు రాజేశం ఆడెపు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.