ఏవీ కన్ స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు పంపిణీ

Published: Friday August 06, 2021
మేడిపల్లి, ఆగస్టు5 (ప్రజాపాలన ప్రతినిధి) : ఏవీ కన్ స్ట్రక్షన్స్ వారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ముద్రించిన నోట్ పుస్తకాలను పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్  మాట్లాడుతూ ఈ కరోనా కాలంలో ప్రతి ఒక్క విద్యార్థి తన విద్యా సంవత్సరంను కోల్పోవద్దని, టిసాట్ ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆన్ లైన్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో పాఠ్య పుస్తకాలను ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని, అలాగే  నోట్ పుస్తకాలను ఏవీ  కన్ స్ట్రక్షన్స్ వారి తరుపున ఉచితంగా పంపిణీ చేయుచున్నామని ఇట్టి అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యలో ముందుండాలని కోరారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొల్తూరి మహేష్, కౌడే పోచయ్య, భీంరెడ్డి నవీన్ రెడ్డి,ఎంపల్ల అనంత రెడ్డి, దొంతిరి హరి శంకర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు షేక్ ఇర్ఫాన్, నాయకులు పప్పుల అంజి రెడ్డి, మాడుగుల చంద్రా రెడ్డి, కుర్ర శ్రీకాంత్ గౌడ్,  అలువాల దేవేందర్ గౌడ్,  బండి సతీష్ గౌడ్, మనోరంజన్ రెడ్డి, రఘువర్ధన్ రెడ్డి, నిర్మల, రాకేష్, స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు సుశీల, ఉపాధ్యాయులు మరియు విద్యార్దిని విద్యార్థులు పాల్గొన్నారు.