మల్లాపూర్ మండల పద్మశాలి నూతన కార్యవర్గం ఎన్నిక

Published: Saturday July 09, 2022
మల్లాపూర్, జులై08(ప్రజాపాలన ప్రతినిధి): మల్లాపూర్ మండల కేంద్రంలోని కె ఎం ఆర్ గార్డెన్ లో శుక్రవారం రోజున మండల పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో  పద్మశాలి నూతన కార్యవర్గం ఎన్నిక కార్యక్రమం జరిగింది. పద్మశాలి జిల్లా అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గడ్డం మధు, రాష్ట్ర నాయకులు సాంబరి ప్రభాకర్, జక్కని కుందన్, గౌరవాధ్యక్షులు సిరిపురం రవీందర్, ముఖ్య అతిథిల సమక్షంలో
మల్లాపూర్ మండల అధ్యక్షులుగా అయ్యోరి దశరథం, ప్రధాన కార్యదర్శిగా పెంబి మహేందర్, ఉపాధ్యక్షులుగా కట్టెకొల వివేకానందం, భూస భూమేశ్వర్, సంయుక్త కార్యదర్శిగా చిప్ప రాజేందర్, కోశాధికారిగా గోల్లవత్తిని విజయ్, ప్రచార కార్యదర్శిగా మార్గం రాజేశ్వర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మాట్లాడుతూ పద్మశాలీలు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని ఇకనైనా మన పద్మశాలి సంఘం వారు ఏకమై మన సమస్యలు పరిష్కరించుకునే దిశలో ప్రతి సభ్యుడు కృషి చేయాలన్నారు. ఈ ఎన్నికకు సహకరించిన సభ్యులకు కుల బాంధవులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యమంలో రుద్ర రాంప్రసాద్, సాంబరి శంకర్, తోట శేఖర్, మైదాసు శ్రీనివాస్, మామిడాల నవీన్, మండలంలోని వివిధ గ్రామాల పద్మశాలి  సంఘాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యక్షులు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.