ఈటెల మల్లయ్య మృతికి సంతాపం తెలిపిన ముదిరాజ్ నాయకులు బెల్లంపల్లి , ఆగస్టు 25 , ప్రజా పాలన ప్రతి
Published: Friday August 26, 2022
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి, హుజురాబాద్ శాసనసభ్యులు ఈటల రాజేందర్ తండ్రి ఈటల మల్లయ్య (104) మృతి పట్ల తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి ముల్కలపల్లి వెంకటేశ్వర్లు, గురువారం సంతాపాన్ని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకొని, తన పిల్లల్ని ఉన్నత చదువులు చదివించి, తెలంగాణ రాష్ట్రానికి, ఉద్యమ కారులను అందించిన మల్లయ్య మరణం, ఈటెల కుటుంబానికే కాకుండా తెలంగాణ రాష్ట్రానికే తీరని నష్టమని అన్నారు. ఆయన మృతి పట్ల మంచిర్యాల జిల్లా ముదిరాజ్ మహాసభ ఘనమైన నివాళి అర్పిస్తుందని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని వ్యక్తం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజు నాయ కులు నూనె రవీందర్, పేట మల్లయ్య, దండ బోయిన భాస్కర్, దండవేని ఐలయ్య, పోలేని కనకయ్య, చింతల రమేష్ , సూరం బానేష్, తాళ్ల కృష్ణమోహన్, అలవేన సంపత్, పిల్లి ఆనంద్, రేగుల వెంకటయ్య, పిడుగు శ్రీనివాస్, పల్లె ప్రశాంత్, మోహన్, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: