బాధిత కుటుంబానికి రూ. 10వేలు ఆర్థిక సాయం
Published: Tuesday June 01, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గచ్చిబౌలి డివిజన్ గోపంపల్లి తండా పరిధిలో కారోనాతో మృతి చెందిన శోభారాణి కుటుంబానికి అత్యవసర సహాయం నిమిత్తం కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 10,000 రూపాయల నగదు వారి కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అనవసరంగా బయటికి వచ్చి ఈ మహమ్మారిని తగిలించుకోవడం సరైనది కాదని, డివిజన్ ప్రజలకు చేతులు జోడించి నమస్కరించాడు. ఇంకా కొన్ని రోజులు ఓపికతో ఇంట్లోనే ఉంటూ తగు జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు. వీరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ విచారం వ్యక్తం చేశారు.
Share this on your social network: