బాధిత కుటుంబానికి రూ. 10వేలు ఆర్థిక సాయం

Published: Tuesday June 01, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గచ్చిబౌలి డివిజన్ గోపంపల్లి తండా పరిధిలో కారోనాతో మృతి చెందిన శోభారాణి కుటుంబానికి అత్యవసర సహాయం నిమిత్తం కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 10,000 రూపాయల నగదు వారి కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అనవసరంగా బయటికి వచ్చి ఈ మహమ్మారిని తగిలించుకోవడం సరైనది కాదని, డివిజన్ ప్రజలకు చేతులు జోడించి నమస్కరించాడు. ఇంకా కొన్ని రోజులు ఓపికతో ఇంట్లోనే ఉంటూ తగు జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు. వీరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ విచారం వ్యక్తం చేశారు.