రాబోయే రోజుల్లో బిఎస్పి పార్టీని మరింత పటిష్టం చేస్తాం

Published: Monday December 06, 2021
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 5 ప్రజాపాలన ప్రతినిధి : బహుజన్ సమాజ్ పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఆదివారం రోజు ఇబ్రహీంపట్నం అసెంబ్లీ అధ్యక్షులు గ్యార మల్లేష్ ఆధ్వర్యంలో అసెంబ్లీ పదాధికారుల సమావేశం తుర్కయంజాల్ మున్సిపాలిటీ రొక్కం సత్తిరెడ్డి గార్డెన్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా. గుండెల ధర్మేందర్, రాష్ట్ర కార్యదర్శి గ్యార జగన్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చెరుకూరి రాజు, జిల్లా ఈ సి మెంబర్ పాల్గొని అసెంబ్లీ లో జరిగిన పని రిపోర్ట్ ని, పనిని విభజించారు. ఈ కార్యక్రమంలో.అసెంబ్లీ కోశాధికారి కంబాలపల్లి శాంత, అబ్ధుల్లాపూర్ మెట్ మండల కన్వీనర్ గుండె శ్రీనివాస్, తుర్కయంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు వద్ధిగళ్ల బాబు, ఉపాధ్యక్షుడు యడవల్లి శ్యామ్, ప్రధాన కార్యదర్శి ధోమలపల్లి రవి కుమార్, కోశాధికారి పట్నం రమేష్ కురుమ, పెద్ద అంబర్ పెట్ మున్సిపాలిటీ అధ్యక్షులు నల్ల పరమేష్, ప్రధాన కార్యదర్శి యంజాల ప్రహ్లాద్, హనుమాండ్ల కృష్ణ, కృపాకర్, గౌరెల్లి సెక్టార్ అధ్యక్షుడు చిత్రం కృష్ణ, కోహెడ బూత్ అధ్యక్షుడు రవికుమార్, అంబర్ పెట్ భూతు అధ్యక్షుడు శివ శంకర్, అంగద్, మరియు యువకులు పాల్గొన్నారు.