బొలెరో, బైక్ ఢీ యువకుడి దుర్మరణం

Published: Tuesday September 27, 2022
ప్రజా పలన ప్రతినిధి,26. నవాబుపేట
 మండల పరిధిలోని కాకర్ల పహాడ్ గ్రామ సమీపంలో గల చెరువు కట్టపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలనగర్ మండలం మాచారం గ్రామానికి చెందిన సుప్ప రవీందర్ (33) దుర్మరణం పాలయ్యాడు.ఓ కేసు విషయంలో నిందితుడైన రవీందర్ కోర్టుకు హాజరవ్వడానికి మహబూబ్ నగర్ కు వెళ్తూ మార్గమధ్యంలో ఉన్న సిద్దోటం గ్రామంలో గల తన మేనత్తను కలిసేందుకు వెళ్తూ
 తన ద్విచక్ర వాహనంపై వెళ్తూ కాకర్లపహాడ్ చెరువు కట్టపై ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని ఢీ కొట్టి బలమైన గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మొబైల్ లో మాట్లాడుతూ బైకును అజాగ్రత్తగా నడపడం వల్లే ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. గతంలో మాచారం గ్రామంలో జరిగిన ఓ హత్య కేసులో మృతుడు రవీందర్ నిందితుడని ఆ కేసు విచారణ కోసం హాజరయ్యేందుకే కోర్టుకు వెళ్తూ మార్గమధ్యంలో మృత్యువుభారిన పడ్డారని, మృతుడికి ఇద్దరు భార్యలు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సంఘటన గురించి తెలిసిన వెంటనే నవానుపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించి,మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
 
 
 
Attachments area