మృతి చెందిన జగదీష్ కుమార్ కుటుంబాన్ని ఆదుకుంటాం

Published: Wednesday October 19, 2022
⮕  టీఆర్ఎస్ పార్టీ 10 లక్షలు
⮕ మున్నూరు కాపు సంఘం 5 లక్షలు
మేడిపల్లి, అక్టోబర్ 18 (ప్రజాపాలన ప్రతినిధి)
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో రామంతాపూర్ ఆర్టీసీ కాలనీకి చెందిన టీఆర్ఎస్ నాయకుడు జగదీష్ కుమార్ ప్రమాదవశాత్తు ఆదివారం మృతి చెందారు. మంగళవారం నిర్వహించిన అంత్యక్రియలో జగదీష్ కుమార్ పార్థివదేహానికి రాజ్యసభ సభ్యులు, రాష్ట్ర మున్నూరు కాపు సంఘం గౌరవ అధ్యక్షులు వద్దిరాజు రవిచంద్ర, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య, మున్నూరు కాపు సంఘం చైర్మన్, గడ్డి అన్నారం మార్కెట్ మాజీ చైర్మన్ సర్దార్ పుట్టం పురుషోత్తం రావు, ఉప్పల్ నియోజకవర్గం మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు గంధం నాగేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ గంధం జోష్ణ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు జగదీష్ కుమార్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. జగదీష్ కుమార్ కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ నుండి రూ 10 లక్షలు, మున్నూరు కాపు సంఘం నుండి రూ 5 లక్షలు ఇప్పిస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ అంత్యక్రియలు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ కాలనీవాసులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.