పట్లూరు తండాలో సిసి రోడ్ల నిర్మాణం

Published: Tuesday March 07, 2023
* 10 లక్షల ఎన్ఆర్ఈజిఎస్ నిధులు మంజూరు
* గత 60 సంవత్సరాల నిర్లక్ష్యానికి గురైన తండా
* పట్లూరు సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్
వికారాబాద్ బ్యూరో 06 మార్చి ప్రజాపాలన : గ్రామం అభివృద్ధి చెందాలంటే స్థానిక సర్పంచ్ ప్రత్యేక చొరవ అత్యంతావశ్యకం. అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిన పట్లూరు తండాను వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, చెవెళ్ళ ఎంపి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి సహకారం మరువలేనిదని సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్ కొనియాడారు. పట్లూరు తండా అభివృద్ధికి 20 లక్షల నిధులు మంజురు చేయించుకున్న ఘనత పట్లూరు సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్ కృషి అభినందనీయం. నిర్లక్ష్యానికి గురైన పట్లూరు తండా అభివృద్ధికి అహర్నిశలు ఆలోచించే వ్యక్తి పట్లూరు సర్పంచ్ ఇందిర అశోక్. సర్పంచుగా ఎన్నికైనప్పటి నుండి పట్లూరు తండా అభివృద్ధికి పక్కా ప్రణాళికలను ఏర్పరుచుకున్నారు. అభివృద్ధికి ఆలోచనలు కార్యరూపం దాల్చాలనే లక్ష్యంతో ఒక్కొక్క పనిని ఎవరి ద్వారా పరిష్కారం అవుతుందోనని ఆలోచించిన వ్యక్తే గ్రామ సర్పంచ్ భర్త దేవరదేశి ఇందిర అశోక్. అందులో భాగంగానే సోమవారం పట్లూరు తండాలో సిసి రోడ్ల నిర్మాణం చేపట్టారు. పట్లూరు గ్రామానికి అనుబంధ గ్రామమైనా ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యానికి గురిచేయకుండా అభివృద్ధి బాట పట్టించడమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతున్నారు సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ పనులు పర్యవేక్షించారు. ఎఈ శ్రవణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి సంతోష వికారాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్  పూర్తి సహాయ సహకారం తో పట్లూరు గ్రామాన్ని పట్లూరు తండాను అభివృద్ధి చేస్తున్నాం అని తెలియ చేశారు. పట్లూరు జీపీకి 20 లక్షలు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.