పాదయాత్ర తోనే కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తద్యం

Published: Thursday September 16, 2021

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నిరంజన్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండల్ పరిధిలోని చెన్నారెడ్డి గూడ గ్రామంలో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా యాత్ర నిర్వహించిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి  జెడ్పీటీసీ మర్రి నిత్య నిరంజన్ రెడ్డి, టిపిసిసి కార్యదర్శి దండెం రామ్ రెడ్డి, ఎంపీటీసీలు నరేందర్ రెడ్డి, జయ నందం, రాందాస్ నాయక్, మధుసుదన్ రెడ్డి, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులుమోతి రామ్ నాయక్, యువజన కాంగ్రెస్ నాయకులు, MNR యువసేన ప్రెసిడెంట్ కమలాకర్ రెడ్డి, ఎస్సీ & ఎస్టీ మహిళలు, పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు, ఈ సందర్భంగా మర్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గo అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే అభివృద్ధి చెందుతుందని ఉదాహరణకు హుజురాబాద్ లో ఎమ్మెల్యే రాజీనామా తో కొత్త పథకాలు వచ్చాయి, కావున ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కూడా రాజీనామా చేస్తే మన నియోజకవర్గానికి కొత్త పథకాలు వచ్చి నియోజికవర్గం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూనం, ఈ సందర్భంగా గ్రామాన్ని సందర్శిస్తూ చెన్నారెడ్డి గూడ గ్రామంలో దళిత గిరిజన కాలనీ లలో తిరుగుతూ సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని నిరంజన్ రెడ్డి తెలిపారు. గ్రామస్థుల కోరిక మేరకు తన సొంత నిధులతో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు, ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త జంగయ్య, జెనిగే పుల్లయ్య, ధర్మ, లాలు, పెంటయ్య, బిక్షపతి, పుల్లయ్య, పాండు, పగడాల వెంకటేష్, భాస్కర్, శ్రీశైలం, రాములు, లక్ష్మణ్, బుగ్గ రాములు, సందీప్, సురేష్, శంకర్, శ్రీశైలం, రాజు, శేఖర్, రమేష్, రాజు, రాజు, మధు, వంశీ మరియు ఎం ఎన్ ఆర్ టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.